ETV Bharat / city

పెద్దలు ఒప్పుకోలేదని క్వారీలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

author img

By

Published : May 16, 2021, 5:48 PM IST

Updated : May 16, 2021, 7:11 PM IST

lovers committed suicide by jumping into a quarry pit in medchal district
lovers committed suicide by jumping into a quarry pit in medchal district

17:46 May 16

క్వారీ గుంతలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమజంట... క్వారీగుంతలో విగతజీవులుగా కనిపించింది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఆ ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన మేడ్చల్​ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండ బాలయ్యనగర్‌లో జరిగింది. ఎన్టీఆర్​నగర్​కి చెందిన విశాల్(21) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మైనర్​ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇటీవలే ఇద్దరు ఇరుకుటుంబాల పెద్దలకు వారి ప్రేమ విషయం తెలియపరిచారు. దానికి వాళ్లు ఒప్పుకోకపోవటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.  

ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు శనివారం తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు విశాల్ మీదే అనుమానం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ క్వారీలో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఆ మృతదేహాలు ప్రేమజంటవేనని తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్​డౌన్

Last Updated :May 16, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.