ETV Bharat / city

ఏపీలో కరోనా కల్లోలం.. గణనీయంగా పెరిగిన పాజిటివ్ కేసులు

author img

By

Published : Apr 20, 2021, 6:41 PM IST

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 37,922 పరీక్షలు నిర్వహించగా... 8,987 కేసులు నిర్ధరణ అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 3,116 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది.

corona
corona

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 37,922 పరీక్షలు నిర్వహించారు. 8,987 కేసులు నిర్ధరణ కాగా 35 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3,116 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 53,889 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు..

గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1,347 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 1,344, గుంటూరు 1,202, చిత్తూరు 1,063, తూర్పుగోదావరి 851, కర్నూలు 758, విశాఖ 675, కృష్ణా 441, విజయనగరం 330, ప్రకాశం 305 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు..

గత 24 గంటల వ్యవధిలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. చిత్తూరు 5, కడప 5, అనంతపురం 3, కృష్ణా 3, శ్రీకాకుళం 3, ప్రకాశం 2, కర్నూలు 2, గుంటూరు 1, విశాఖ 1, విజయనగరం 1, తూర్పుగోదావరి 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ap corona cases, corona cases in ap
ఏపీలో కరోనా కేసులు, ఏపీ కొవిడ్ కేసులు

ఇదీ చదవండి: కోర్టులో ఏడుగురు జడ్జిలు సహా 44 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.