ETV Bharat / city

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌

author img

By

Published : May 29, 2020, 7:45 PM IST

CENTRAL HOME MINISTER TO JAGAN
ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31తో ముగుస్తున్నందున... తదుపరి కార్యాచరణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్​షా మాట్లాడారు. ఇందులో భాగంగానే సీఎం జగన్​కు ఫోన్ చేశారు.

కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కరోనా నివారణ కోసం ఏపీలో తీసుకుంటున్న చర్యలను అమిత్​షాకు సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.