ETV Bharat / city

'దళితులంటూ.. ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు'

author img

By

Published : May 6, 2021, 2:24 PM IST

గ్రామ పెద్దల నుంచి తమను రక్షించాలంటూ.. పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్​ నిర్వాసితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. అగ్ర కులస్థులు.. గ్రామ సభలో దళితులు దక్షిణాన ఉండాలంటూ తీర్మానించి.. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారంటూ బండరావి పాకుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Expatriates of Palamuru Rangareddy
Expatriates of Palamuru Rangareddy

పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్​ నిర్వాసితులు.. న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. నూతన గ్రామం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని అమలు చేయకుండా.. గ్రామ పెద్దలు కులాల ప్రతిపాదికన స్థలాలు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని బండరావి పాకుల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామ సభలో.. దళితులు దక్షిణాన ఉండాలంటూ తీర్మానించి తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ చాటుగా ఇంటింటికి తిరుగుతూ.. పంచాయతీ రికార్డుల్లో కాకుండా.. తెల్ల కాగితంపై సంతకాలు పెట్టిస్తున్నారని వాపోయారు. గ్రామ సభ నిర్వహించి లక్కీ డిప్ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించాలని వారు వేడుకున్నారు.

ఇదీ చదవండి: మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.