ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్​@9PM

author img

By

Published : Mar 28, 2021, 9:00 PM IST

top news telugu, etv bharat top news
టాప్​ టెన్ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. యాదాద్రిలో మరో 32 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో పనిచేసే 32 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. శనివారం 30 మంది ఉద్యోగులకు వైరస్​ సోకగా రెండు రోజుల్లో 62 మంది కొవిడ్​ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అగ్ని ప్రమాదం.. ఓ వ్యక్తి సజీవదహనం

ఓ ప్రాజెక్టు వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలు కాస్తా చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. అక్కడ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరంలో డీజిల్​ కారణంగా అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ పార్టీలకు కాంగ్రెస్ లేఖలు

కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేఖలు రాసింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఘనంగా పెద్దాపూర్ మల్లన్న జాతర

జగిత్యాల జిల్లా పెద్దాపూర్​వాసులు ఆనవాయితీగా నిర్వహించుకునే మల్లన్న స్వామి జాతర అట్టహాసంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో మల్లన్నకు బోనాలు సమర్పించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తృణమూల్‌ నేత అరెస్టు!

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ నేత ఛత్రాధర్‌ మహతోను ఎన్​ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల కస్టడీకి తరలించారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఆయనను యూఏపీఏ కింద అరెస్టు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భక్తులకు సేవలపై ప్రతిజ్ఞ

హరిద్వార్​లో వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తామని ఉత్తరాఖండ్ పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు ప్రతిజ్ఞ చేశాయి. భక్తులంతా సురక్షితంగా ఉండేలా పనిచేయనున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. హిరేన్‌ మృతి కేసులో మలుపు

ముకేశ్​ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు యజమానిగా అనుమానిస్తున్న మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహం దొరికిన మితి నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. కంప్యూటర్‌ సీపీయూ, వాహనం నంబర్‌ ప్లేట్​ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారత్, అమెరికా విన్యాసాలు

రక్షణ, సైనిక భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహా సముద్రంలో భారత్, అమెరికా నౌకాదళ విన్యాసాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'సిక్సర్ల' రికార్డు

పుణెలో జరుగుతున్న మూడో వన్డేలో ఓ రికార్డు నమోదైంది. టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​ పూర్తయ్యేసరికి మొత్తంగా ఈ సిరీస్​లో ఇరు జట్లు కలిపి 63 సిక్స్​లు నమోదు చేశాయి. ఫలితంగా అత్యధిక సిక్స్​లు నమోదైన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​గా ఇది నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. గూఢచారిగా రాధికా-'వై' టీజర్​

బాలీవుడ్​ నటి రాధికా ఆప్టే తన కొత్త సినిమాలో గూఢచారి పాత్ర పోషించనుంది. 'మిసెస్​ అండర్​కవర్'​ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీకాంత్‌, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ 'వై' టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.