ETV Bharat / city

ఎర్రచందనం స్మగ్లర్​పై ఈడీ కొరడా... భారీగా ఆస్తుల జప్తు

author img

By

Published : Mar 29, 2022, 8:19 PM IST

ENFORCEMENT DIRECTORATE
ENFORCEMENT DIRECTORATE

ENFORCEMENT DIRECTORATE NEWS: తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్​పై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కొరడా ప్రయోగించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టుకున్న సుమారు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.

ENFORCEMENT DIRECTORATE NEWS: తమిళనాడుకు చెందిన కరడుగట్టిన స్మగ్లర్ ఆర్.సెల్వరాజ్​పై ఈడీ కొరడా ఝులిపించింది. ఆయనకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టుకున్న సుమారు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఎన్​ఫోర్స్​​మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

సెల్వరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఏపీ పోలీసులు, చెన్నై కస్టమ్స్ విభాగం.. గతంలో అతని​పై నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఎర్రచందనం అమ్మకాల ద్వారా పొందిన అక్రమ సొమ్మును చెలామణి చేసేందుకు సంజన మెటల్​వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఈడీ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాల్లో సెల్వరాజ్, అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూములనూ అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఇదీ చదవండి:జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, అనుబంధ సంస్థల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.