ETV Bharat / city

జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, అనుబంధ సంస్థల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

author img

By

Published : Mar 28, 2022, 9:57 PM IST

BANK FRAUDS: రుణాల పేరిట బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. తాజాగా మరో 63 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది.

ENFORCEMENT DIRECTORATE
ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్

BANK FRAUDS: బ్యాంకులను రుణాల పేరిట మోసం చేశారన్న అభియోగంపై జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, దాసి అనుబంధ సంస్థల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆదిలాబాద్​లో 63 కోట్ల రూపాయల విలువైన 2,050 ఎకరాలను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. రుణాల పేరిట ఎస్​బీఐ, యూకో బ్యాంకులను 306 కోట్ల రూపాయల మేర జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్ మోసం చేసిందని గతంలో సీబీఐ బెంగళూరు విభాగం కేసు నమోదు చేసింది.

మనీలాండరింగ్ అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ గతంలో కొన్ని ఆస్తులు అటాచ్ చేసి అభియోగపత్రం సమర్పించింది. తాజాగా మరో 63 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది.

ఇదీ చదవండి:అప్పు చెల్లించినా బ్లాక్‌మెయిల్.. ఫొటో మార్ఫ్‌ చేస్తామంటూ బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.