ETV Bharat / city

ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు, 4 మరణాలు

author img

By

Published : Dec 8, 2020, 7:50 PM IST

ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,72,839కు చేరింది. వైరస్ బారినపడి నలుగురు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 7వేల 42కి పెరిగింది.

corona-cases-in-andhra-pradesh
ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు, 4 మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 56వేల 187 కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... 551 మందికి పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి మరో నలుగురు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 8లక్షల 72వేల 839కి చేరగా.. మృతుల సంఖ్య 7,042కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 8.6లక్షల మంది కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 429 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇదీ చూడండి: రేపు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.