ETV Bharat / city

Jagan on oppositions: ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా నన్నేం చేయలేరు: జగన్

author img

By

Published : Apr 8, 2022, 3:44 PM IST

Jagan on oppositions: "దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. ఎంతగా బురదచల్లినా ఎవరూ నన్నేమీ చేయలేరు" అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జగనన్న వసతిదీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.

AP CM Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్

Jagan on oppositions: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. "జగనన్న వసతి దీవెన" రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన అనంతరం నంద్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ఈ సభలో.. ప్రతిపక్షాలతో పాటు మీడియాపైనా తీవ్ర పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు.

ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా నన్నేం చేయలేరు: జగన్

నన్నెవరూ ఏమీ చేయలేరు : దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఎవరెంతగా బురదచల్లినా తననేమీ చేయలేరని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో మాదిరిగా అరకొరగా కాకుండా.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. ‘ఒక కుటుంబంలో ఎంత మందిని చదివించినా మీకు తోడుగా నేను ఉంటానని హామీ ఇచ్చారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల వారు కళాశాలలకు వెళ్తారని.. దీంతో కాలేజీలకు కూడా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది తల్లులకు మేలు జరుగుతోందని... కొత్తగా రాష్ట్రానికి 16 వైద్య కళాశాలలు వస్తున్నాయి’ అని ఏపీ సీఎం జగన్ చెప్పారు.

ఇదీ చదవండి:
Jagananna Vasathi Deevena: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.