ETV Bharat / city

Three Capitals: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: ఏపీ సీఎం జగన్‌

author img

By

Published : Mar 24, 2022, 10:01 PM IST

Three Capitals: వికేంద్రీకరణ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన అభిప్రాయాన్ని మరోమారు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. రాజధాని విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు.. రాజ్యాంగంతోపాటు శాసనసభకు ఉన్న అధికారాలనూ ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించారు.

Three Capitals: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: ఏపీ సీఎం జగన్‌
Three Capitals: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: ఏపీ సీఎం జగన్‌

Three Capitals: పాలనా వికేంద్రీకరణే వైకాపా ప్రభుత్వ విధానమని, రాజధానిపై నిర్ణయం తమ హక్కు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. రాబోయే తరాల బాధ్యత కూడా తమపై ఉందని, వికేంద్రీకరణబాటలో నడవడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన సీఎం.. హైకోర్టు తీర్పును ప్రస్తావించినట్లు 'పీటీఐ' వార్తా కథనం వెల్లడించింది. రాజధాని విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు.. రాజ్యాంగంతోపాటు శాసనసభకు ఉన్న అధికారాలనూ ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించారు.

న్యాయవ్యవస్థపై అచంచల విశ్వాసం ఉందంటూనే.. ఆ తీర్పు సమాఖ్య స్ఫూర్తికి, చట్టసభల అధికారాలకూ విరుద్ధమన్నారు. చట్టసభకు చట్టాలు చేసే అధికారం లేదంటే న్యాయవ్యవస్థ చట్టాలు చేస్తుందా ? అని ప్రశ్నించారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని.. కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని సీఎం చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. ఉంటే అప్పట్లోనే.., విజయవాడనో, గుంటూరునో రాజధానిగా ప్రకటించేవారని జగన్‌ వ్యాఖ్యానించారు. కేవలం అమరావతి నిర్మాణం ఒక్కటే ప్రభుత్వ ప్రాధాన్యం కాదని.. రాష్ట్రంలో మిగతా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉటుందనే విషయాన్ని మరువరాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా కథనాన్ని ప్రచురిచింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.