ETV Bharat / city

పేదలకు అండగా తెదేపా... కుప్పంలో చంద్రబాబు పర్యటన

author img

By

Published : Feb 25, 2021, 7:42 PM IST

తెదేపా కార్యకర్తలను ఇబ్బందిపెడితే ఉపేక్షించబోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. రాళ్లగంగమ్మ ఆలయం వద్ద గుడుపల్లె కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

పేదలకు అండగా తెదేపా... కుప్పంలో చంద్రబాబు పర్యటన
పేదలకు అండగా తెదేపా... కుప్పంలో చంద్రబాబు పర్యటన

ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. రాళ్లగంగమ్మ ఆలయం వద్ద గుడుపల్లె కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేదలకు తెదేపా అండగా ఉంటుందని.. వారి తరఫున పోరాడుతుందని చంద్రబాబు అన్నారు.

దోపిడీ రాజకీయాలు చేసి ప్రజలను బాధపెడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో హుందాతనం చాలా అవసరమని హితవు పలికారు.

పేదలకు అండగా తెదేపా... కుప్పంలో చంద్రబాబు పర్యటన

ఇదీ చూడండి: ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల భర్తీ... చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.