ETV Bharat / city

POLAVARAM: 'పోలవరం రివైజ్డ్‌ డీపీఆర్‌ పెండింగ్‌ లేదు'

author img

By

Published : Aug 2, 2021, 5:13 PM IST

పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ డీపీఆర్‌ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2009 జనవరి 20 లోపు వచ్చిన ఏ డీపీఆర్‌ కూడా పెండింగ్‌లో లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​.. రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.

center on polavaram
center on polavaram

పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ డీపీఆర్‌ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. 2005-06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో డీపీఆర్‌ ఆమోదించారని స్పష్టం చేసింది. 2009 జనవరి 20 తర్వాత తమ వద్ద డీపీఆర్‌ పెండింగ్‌లో లేదని వెల్లడించింది. 2009 జనవరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన డీపీఆర్‌ రాలేదని జల్​ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు.

2005-06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లతో డీపీఆర్‌ ఆమోదించారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ 2011, 2019లో ఆమోదించిందన్నారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు.. జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానం చెప్పారు.

ఇదీచూడండి: CM KCR Speech: 'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.