ETV Bharat / city

తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు!

author img

By

Published : Jan 20, 2022, 10:42 PM IST

Brother Anil - yvb rajendra prasad: బ్రదర్ అనిల్.. తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకే వేదికను పంచుకున్నారు. ఇందుకు ఏపీలో కృష్ణా జిల్లాలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవం వేదికైంది. ఇరువురు మధ్య పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు!
తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు!

Brother Anil - yvb rajendra prasad: ఒకే వేదికపై బ్రదర్ అనిల్.. తెదేపా నేత బాబు రాజేంద్రప్రసాద్ రావటంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఇరువురు కలిశారు. బ్రదర్ అనిల్, యలమంచిలి భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వీరి మధ్య అరగంట పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్​లకు ఆహ్వానం అందినప్పటికీ.. హాజరుకాలేదు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కరోనా బారినపడ్డారని.. అందుకే హాజరుకాలేదని ఆయన అనుచరులు అంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.