ETV Bharat / city

'పుష్ష‌`షూటింగ్​కు బ్రేక్.. దర్శకుడికి అస్వస్థత!

author img

By

Published : Jul 25, 2021, 5:39 PM IST

sukumar
sukumar

దర్శకుడు సుకుమార్ తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ అనారోగ్యం కారణంగా 'పుష్ష‌' షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం.

'పుష్ష‌`షూటింగ్​కి బ్రేక్ పడిన‌ట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నందున షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. క‌రోనా వ‌ల్ల‌ పుష్ష షూటింగ్ ఆల‌స్యం అయింది. తిరిగి ప్రారంభం అయినప్పటికీ అది కాస్తా ఇప్పుడు సుకుమార్‌ అనారోగ్యం కారణంగా మ‌ళ్లీ ఆగింది.

కథానేపథ్యం:

చిత్తూరు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో 'పుష్ప'ను దర్శకుడు సుకుమార్.. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్​తో మైత్రీమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది చివరి కల్లా థియేటర్లలోకి 'పుష్ప'ను తీసుకురావాలనేది ప్లాన్! మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.

ఇదీ చూడండి: OTT Release: ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.