ETV Bharat / city

ఇప్పుడే మంత్రితో మాట్లాడా.. వరి వేయొద్దని కేంద్రం ఎప్పుడూ చెప్పలే: ఎంపీ అర్వింద్​

author img

By

Published : Nov 9, 2021, 7:19 PM IST

తాను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిలో ఇప్పుడే మాట్లాడానని.. వరి వేయొద్దని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్​ స్పష్టం చేశారు. దళిత బంధు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్​, నిరుద్యోగ భృతిపై వంటి హామీల నుంచి ప్రజలను డైవర్ట్​ చేసేందుకే కేంద్రంపై సీఎం కేసీఆర్​ నిందలు వేస్తున్నారని అర్వింద్​ ఆరోపించారు.

bjp mp arvind
bjp mp arvind

వరి వేయొద్దని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాసిచ్చారని సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ స్పందించారు. తాను ఇప్పుటే కేంద్ర మంత్రితో మాట్లాడానని చెప్పారు. కేంద్రం వరి కొనలేదని ఎప్పుడు చెప్పలేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​ స్పష్టం చేశారు. కేసీఆర్​ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని సీఎం కేసీఆర్​ను కోరారు. కేసీఆర్​ చెప్పినవి ఇప్పటి వరకు ఏం అమలుకాలేదని ఆరోపించారు.

దళిత బంధు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్​, నిరుద్యోగ భృతిపై వంటి హామీల నుంచి ప్రజలను డైవర్ట్​ చేసేందుకే కేంద్రంపై సీఎం కేసీఆర్​ నిందలు వేస్తున్నారని అర్వింద్​ ఆరోపించారు. కేసీఆర్​ ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు.. ఆయన మెడలు వంచుతామన్నారు.

పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ పెంచలేదని సీఎం చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చక సుమారు 7 శాతం వ్యాట్​ పెంచారని ఎంపీ అర్వింద్​ చెప్పారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్​ అబద్దాలు చెప్పారని ఆరోపించారు. కేసీఆర్​ చెప్పిన కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్​, మిషన్​ భగీరథ వంటి పథకాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయని అర్వింద్​ అన్నారు.

bjp mp arvind: వరి వేయొద్దని కేంద్రం ఎప్పుడూ చెప్పలే: ఎంపీ అర్వింద్​

ఇదీచూడండి: Bandi sanjay comments on kcr speech: కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.