ETV Bharat / city

'కొవిడ్ విధి నిర్వహణలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం'

author img

By

Published : May 10, 2020, 9:08 PM IST

కొవిడ్​ విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇస్తామని డీజీపీ గౌతం సవాంగ్​ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

'కొవిడ్ విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే రూ.50 లక్షల పరిహారం'
'కొవిడ్ విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే రూ.50 లక్షల పరిహారం'

ఏపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కొవిడ్​ సమయంలోనూ జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

పోలీసులకు రూ.50 లక్షలు...

పోలీస్ సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కొవిడ్​-19 విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. కరోనా కట్టడికి దేశం తీసుకుంటున్న చర్యలు.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు మ్యాపింగ్​ చేస్తున్నామని వివరించారు.

'కొవిడ్ విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే రూ.50 లక్షల పరిహారం'

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.