ETV Bharat / city

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ నేడే

author img

By

Published : Sep 26, 2022, 10:37 AM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. అనంతరం మృత్సంగ్రహణ యాత్ర చేపడతారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ నేడే
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ నేడే

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వర స్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవి పూజ అనంతరం మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ మృత్సంగ్రహణ యాత్ర తర్వాత మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేస్తారు. దీన్నే అంకురార్పణగా పేర్కొంటారు.

ఇవీ చదవండి..:

నేడు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి.. రాష్ట్రమంతా వేడుకలు..

మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.