ETV Bharat / city

గోదావరి బోర్డు సమావేశం వాయిదా... ఎందుకంటే?

author img

By

Published : Mar 11, 2022, 7:13 PM IST

Godavari River management Board
Godavari River management Board

Godavari Board Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు రాకపోవడంతో జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేశారు. ఏపీ సభ్యుల గైర్హాజరు పట్ల తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Godavari Board Meeting : గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో జీఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ సమావేశాన్ని వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం హైదరాబాద్ జలసౌధలో బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఏపీ సభ్యులు రాకపోవడంతో భేటీని ఛైర్మన్ వాయిదా వేశారు.

బోర్డు ఛైర్మన్​కు సమాచారం ఇవ్వకుండా ఏపీ సభ్యులు గైర్హాజరు కావడంపై తెలంగాణ నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు సభ్యుల హాజరును ధ్రువీకరించుకున్నాకే బోర్డు సమావేశం నిర్వహించాలని రజత్ కుమార్ కోరారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి.. మంత్రి జగదీశ్​రెడ్డి మధ్య తీవ్రవాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.