ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Feb 28, 2023, 12:28 PM IST

gold price today in hyderabad and vijayawada
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా..

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.57,390 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.65,074 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,390గా ఉంది. కిలో వెండి ధర రూ.65,074 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,390 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,074గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,390 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,074 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,390 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,074గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1814.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.63 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,35,475పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,35,475
ఇథీరియంరూ.1,34,597
టెథర్​రూ.82.70
బైనాన్స్​ కాయిన్​రూ.25,132
యూఎస్​డీ కాయిన్రూ.82.70

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 144.85 పాయింట్ల లాభపడి 59,433 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 17,428 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, లార్సెన్ అండ్ టూబ్రో, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం విలువ
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి 82.68 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.