ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?..

author img

By

Published : Jan 11, 2023, 11:00 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

gold rate today
బంగారం

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.140 పడిపోయి.. ప్రస్తుతం రూ.57,660 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.94 తగ్గి.. ప్రస్తుతం రూ. 69,906 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,660 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,906 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,660 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,906 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,660 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,906 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,660 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,906 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1880.15 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.70 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.14,22,267 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.14,22,267
ఇథీరియంరూ.1,08,600
టెథర్​రూ.81.68
బైనాన్స్​ కాయిన్​రూ.22,453
యూఎస్​డీ కాయిన్రూ.81.72

స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతుండడం గమనార్హం. సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 59,875 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 17,841 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.74 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.