ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా!

author img

By

Published : Nov 14, 2022, 11:07 AM IST

Gold Rate Today
స్వల్పంగా పెరిగిన బంగారం,

Gold Rate Today : దేశంలో బంగారం, వెండిలు ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం, వెండిలు ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.150 పెరిగి.. ప్రస్తుతం రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.186 పెరిగి.. రూ.63,237 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,200గా ఉంది. కిలో వెండి ధర రూ.63,237వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,237గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,237 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur:ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,237గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1771.25 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.28 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.12,92,282 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.12,92,282
ఇథీరియంరూ.95,620
టెథర్​రూ.80.39
బినాన్స్​ కాయిన్​రూ.21,789
యూఎస్​డీ కాయిన్రూ.80.95

స్టాక్​ మార్కెట్లు: అంతర్జాతీయ మార్కట్​లో మార్పుల వలన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయి.. తరవాత ఒడుదుడుకులను చవిచూసింది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 92.98 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 62,888 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 44.4 పాయింట్లు ఎగబాకి 18,364 దగ్గర ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి: పవర్ గ్రిడ్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రారంభ ట్రేడ్‌లో లాభాలభాట పట్టాయి. డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీలు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ: ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 15 పైసలు తగ్గింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 80.93కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.