ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

author img

By

Published : Sep 23, 2022, 11:26 AM IST

gold
బంగారం

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.350 పెరిగి.. ప్రస్తుతం రూ.51,650 గా ఉంది. కేజీ వెండి ధర రూ.620 పెరిగి ప్రస్తుతం రూ.58,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,650గా ఉంది. కిలో వెండి ధర రూ.58,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,650 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,900 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,650 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,900 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1671 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.61 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,69,696 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,69,696
ఇథీరియంరూ.1,09,125
టెథర్​రూ.80.85
బినాన్స్​ కాయిన్​రూ.22,451
యూఎస్​డీ కాయిన్రూ.81.07

Stock Market Updates : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో పాటు.. రూపాయి పతనంతో స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 655 పాయింట్లు నష్టపోయి 56,465 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 193 పాయింట్ల నష్టంతో 17,436 దగ్గర ట్రేడవుతోంది. టాప్‌ 30 సూచీల్లో టాటా స్టీల్, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్​, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టెక్​మహీంద్రా, అల్ట్రాసెమ్కో, భారతీ ఎయిర్​టెల్, డాక్టర్​ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ: శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 44 పైసలు దిగజారింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 81.09కు చేరింది.

ఇవీ చదవండి: రూపాయి మరింత పతనం.. వాటి ధరలకు రెక్కలు.. ఇక కష్టమే!

అతిపిన్న వయసులోనే బిలియనీర్ల క్లబ్​లోకి.. జెప్టో కుర్రాళ్ల విజయగాథ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.