ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే?

author img

By

Published : Jun 21, 2023, 11:13 AM IST

Gold Rate Today
Gold and silver Rates Today

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దామా?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్​ పసిడి ధర రూ.59,340 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి ధర రూ.72,100గా ఉంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల 24 క్యారెట్​ బంగారం సుమారు రూ.675 పెరిగి.. రూ.60,715 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,160 తగ్గి.. రూ.72,160వద్ద ట్రేడవుతోంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,715 ఉంది. కిలో వెండి ధర రూ.రూ.72,160గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,715గా ఉంది. కిలో వెండి ధర రూ.రూ.72,160గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,715గా ఉంది. కిలో వెండి ధర రూ.రూ.72,160గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Rate : అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1951.50 డాలర్లు ఉండగా.. బుధవారం నాటికి సుమారు 15 డాలర్లు దిగివచ్చి 1936.60 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్​ వెండి ధర 23.14 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Bitcoin Value : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,57,804 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,57,804
ఇథీరియంరూ.1,48,577
టెథర్ రూ.82.4
బైనాన్స్ కాయిన్రూ.20,591
యూఎస్​డీ కాయిన్​ రూ.82.7

స్టాక్​మార్కెట్లు..
దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. కొనుగోలుదార్ల మద్దతుతో హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, రిలయన్స్​ షేర్లు లాభాల బాటపట్టమే ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్​ తన జీవితకాల గరిష్ఠం 63 వేల 588.31కి చేరుకుంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 13 పాయింట్లు వృద్ధి చెంది 18,829 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్​ టీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, విప్రో, రిలయన్స్​, టీసీఎస్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : టాటా మోటార్స్, యాక్సిక్​ బ్యాంక్​, మారుతి సుజుకి, టాటా స్టీల్​, ఐటీసీ, ఇన్ఫోసిస్​

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి దాదాపు స్థిరంగా ఉంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే ఒక్క పైసా తగ్గి రూ.82.10 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.