ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో నేడు బంగారం రేట్లు ఇలా...

author img

By

Published : Mar 27, 2022, 10:12 AM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: బంగారం ధర ఆదివారం స్థిరంగా ఉంది. పది గ్రాముల మేలిమి పుత్తడి ప్రస్తుతం రూ.53,690 పలుకుతోంది. వెండి ధరలోనూ మార్పు లేదు.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,690గా ఉంది. కిలో వెండి ధర రూ.70,536 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.53,690 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,536గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,690గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,536 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,690గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,536 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు సైతం ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉన్నాయి. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర యథాతథంగా ఉంది. శనివారం స్పాట్ గోల్డ్ రేటు 1958 డాలర్లు పలికింది. ప్రస్తుతం అదే స్థాయిలో కొనసాగుతోంది. స్పాట్ వెండి ధర సైతం స్థిరంగానే ఉంది. ఔన్సు స్పాట్ వెండి.. 25.57 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

మరోవైపు, వాహనదారులపై మళ్లీ పిడుగుపడింది. ఇంధన ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి.
• హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 57 పైసలు, డీజిల్​పై 60 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో నగరంలో పెట్రోల్ ధర రూ.112.35కు పెరిగింది. డీజిల్ ధర రూ.98.68కి చేరుకుంది.
• విశాఖపట్నంలో పెట్రోల్ ధర 55 పైసలు పెరిగి.. రూ.113.08కు చేరింది. డీజిల్ లీటర్ ధర 58 పైసలు అధికమై.. రూ.99.09కు ఎగబాకింది.
• గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 54పైసలు అధికమై.. రూ.114.36కు చేరుకుంది. డీజిల్ ధర వంద రూపాయలు దాటింది. 57 పైసల పెంపుతో రూ.100.33కు చేరింది.

ఇవీ చూడండి: 'భారత్​లో రికార్డు స్థాయికి డిజిటల్‌ చెల్లింపులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.