ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమైన బిట్​కాయిన్​

author img

By

Published : Jun 14, 2022, 11:18 AM IST

Updated : Jun 14, 2022, 12:43 PM IST

Gold Price Today
Gold Price Today

Gold Price Today: బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,290గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,800గా ఉంది. బిట్​కాయిన్​ విలువ ఒక్కరోజే 10 శాతానికిపైగా పతనమైంది.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,290 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.61,800గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,290గా ఉంది. కిలో వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,290గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,800గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,290గా ఉంది. కేజీ వెండి ధర రూ. 61,800వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,290గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1826 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.22 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.05 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ 10 శాతం పతనమైంది. ప్రస్తుతం రూ. 19,17,177 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.19,17,177
ఇథీరియం రూ.1,02,442
టెథర్ రూ.83.79
బినాన్స్​ కాయిన్ రూ.19,251
యూఎస్​డీ కాయిన్ రూ.83.93

Stock Market: సోమవారం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్​ సూచీలు.. మంగళవారం సెషన్​లో కాస్త కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా పెరిగి మళ్లీ 53 వేల మార్కును అధిగమించింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 15 వేల 850 ఎగువన ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్​, అపోలో హాస్పిటల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, గ్రేసిమ్​, ఎన్​టీపీసీ లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్​, ఓఎన్​జీసీ, బీపీసీఎల్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, యూపీఎల్​ నష్టపోయాయి.

ఇదీ చదవండి: 'పసిడి'పై ఇన్వెస్ట్​ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?

Last Updated :Jun 14, 2022, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.