ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి లెక్కలు ఇలా

author img

By

Published : Jun 9, 2022, 10:34 AM IST

d
d

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,790గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,853గా ఉంది.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.190 పెరిగింది. ప్రస్తుతం రూ.52,790 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.50 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.63,850 ఎగువన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,790గా ఉంది. కిలో వెండి ధర రూ.63,853 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,853గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,853 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,790గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,853 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1855 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.11 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు తగ్గి రూ. 77.78కి చేరింది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ. 24,85,706 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,85,706
ఇథీరియంరూ.1,47,714
టెథర్రూ.82.34
బినాన్స్​ కాయిన్రూ.23,705
యూఎస్​డీ కాయిన్రూ.82.40

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం సెషన్​లో ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 20 పాయింట్లు పెరిగి.. 54,910 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో.. 16,360 వద్ద ఉంది. డాక్టర్​ రెడ్డీస్, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్, మారుతీ, ఐటీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటాస్టీల్, శ్రీసిమెంట్, గ్రేసిమ్, బజాజ్​ ఫైనాన్స్​, హిందాల్కో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫార్మా రంగం మినహా ఇతర షేర్లు అన్నీ ఒత్తిడికి గురవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ఇక క్రెడిట్​ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్​.. ఆర్​బీఐ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.