ETV Bharat / business

రెండో రోజూ లాభాలు- 54,550 పైకి సెన్సెక్స్​

author img

By

Published : Aug 10, 2021, 3:45 PM IST

వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ (Sensex today) 152 పాయింట్ల లాభంతో 54,550 ఎగువన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 22 పాయింట్ల లాభంతో 16,280 వద్దకు చేరింది.

stocks close with Profits
స్టాక్ మార్కెట్లుకు లాభాలు

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ (Sensex today) 152 పాయింట్లు పెరిగి 54,555 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 22 పాయింట్ల లాభంతో 16,280 వద్దకు చేరింది.

మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్​. టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విద్యుత్​, లోహ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 54,779 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 54,308 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,359 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త రికార్డు), 16,202 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్​, ఎం&ఎం లాభాలను గడించాయి.

టాటా స్టీల్​, ఐటీసీ, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, బజాజ్ ఆటో నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు లాభాలతో ముగిశాయి. కోస్పీ (దక్షిణ కొరియా) మాత్రం నష్టాలను నమోదు చేసింది.

ఇదీ చదవండి: విమాన టికెట్​ కొనాలా? ఇలా చేయకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.