ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల రికార్డుల మోత- 55,400పైకి సెన్సెక్స్

author img

By

Published : Aug 13, 2021, 3:49 PM IST

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ (Sensex today) 593 పాయింట్లు పుంజుకుని.. నూతన గరిష్ఠమైన 55,400 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty today) 165 పాయింట్ల లాభంతో.. తొలిసారి 16,500 మార్క్​ పైన ముగిసింది.

stocks new  records
మార్కెట్ల కొత్త రికార్డులు

స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డుల మోత మోగించాయి. బుల్ విజృంభణతో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 593 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,437 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 165 పాయింట్ల లాభంతో సరి కొత్త రికార్డు స్థాయి అయిన 16,529 వద్ద ముగిసింది.

అంతర్జాతీయంగా ఇతర మార్కెట్లు ప్రతికూలంగా స్పందించినా దేశీయ సూచీలు రికార్డులను నమోదు చేయడం గమనార్హం. ఐటీ, లోహ, టెలికాం సహా హెవీ వెయిట్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

BSE wishes for crossing 55K mark
55 వేల మార్క్​ దాటిన సందర్భగా బీఎస్​ఈ శుభాకాంక్షలు

సెన్సెక్స్ 55,487 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 54,905 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,543 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,376 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​, ఎల్​&టీ, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్, టాటా స్టీల్​ ప్రధానంగా లాభాలను గడించాయి.

పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​, బజాజ్ ఫినాన్స్, ఎన్​టీపీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు నష్టాలను నమోదు నమోదు చేశాయి.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన విమాన ఛార్జీలు- కొత్త ధరలు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.