ETV Bharat / business

ప్రతికూల సంకేతాలతో.. ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

author img

By

Published : May 27, 2020, 9:49 AM IST

Updated : May 27, 2020, 10:27 AM IST

stocks
ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 30, 641 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగింది.

వరుసగా రెండోరోజు లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రస్తుతం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. లాక్​డౌన్​ ఎత్తివేతపై ఆయా దేశాల్లో నెలకొన్న అనిశ్చితితో అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలివ్వడం.. దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 30, 641 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల వృద్ధితో 9,043 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

30 షేర్ల సూచీ సెన్సెక్స్​లో కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, టాటా స్టీల్, బజాజ్​ ఆటో సహా 13 సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్​ఫార్మా, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీలివర్, ఓఎన్​జీసీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు..

బ్యారెల్ ముడిచమురు ధర 0.17 శాతం తగ్గి 36.11 గా ఉంది.

ఇదీ చూడండి: 'స్వాతంత్య్రం తర్వాత ఇదే దారుణమైన మాంద్యం'

Last Updated :May 27, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.