ETV Bharat / business

Stock Market: రెండో రోజూ అదే జోరు

author img

By

Published : Jun 25, 2021, 3:42 PM IST

Updated : Jun 25, 2021, 4:13 PM IST

ఒడుదొడుకుల సెషన్​ను లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 226 పాయింట్లు లాభపడి.. 52,900 ఎగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 70 పాయింట్ల లాభంతో.. 15,850 పైన స్థిరపడింది.

stocks ends with profit
స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల జోరును కొనసాగించాయి. వారాంతపు సెషన్​లో.. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 226 పాయింట్లు పుంజుకుని 52,925 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 70 పాయింట్ల లాభంతో 15,860 వద్దకు చేరింది.

సెషన్​ మొత్తం ఒడుదొడుకుల్లో సాగినా.. లోహ, బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల దన్నుతో చివరకు లాభాలను నమోదు చేశాయి సూచీలు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలూ ఇందుకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,973 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,614 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,870 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 15,772 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​, యాక్సిస్​ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్ ఎక్కువగా లాభాలను గడించాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ, టైటాన్​, ఏషియన్​ పెయింట్స్​ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్​ సెంగ్​ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి:అత్యవసర నిధి జమ చెయ్​- సమస్యల తీరాన్ని దాటేయ్​..

Last Updated : Jun 25, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.