స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల జోరును కొనసాగించాయి. వారాంతపు సెషన్లో.. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 226 పాయింట్లు పుంజుకుని 52,925 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 70 పాయింట్ల లాభంతో 15,860 వద్దకు చేరింది.
సెషన్ మొత్తం ఒడుదొడుకుల్లో సాగినా.. లోహ, బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల దన్నుతో చివరకు లాభాలను నమోదు చేశాయి సూచీలు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలూ ఇందుకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,973 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,614 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,870 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 15,772 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ ఎక్కువగా లాభాలను గడించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్ సెంగ్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.