ETV Bharat / business

మార్కెట్లపై బేర్ పంజా- మదుపర్ల సంపద రూ.10లక్షల కోట్లు ఆవిరి!

author img

By

Published : Jan 24, 2022, 3:39 PM IST

Updated : Jan 24, 2022, 3:55 PM IST

Stock market news: స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఫెడ్​వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాల కారణంగా సెన్సెక్స్​ 1500 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 450కిపైగా పాయింట్లు కుప్పకూలింది. ఫలితంగా ఒక్క రోజులోనే రూ.10లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

stock market news
మార్కెట్లపై బేర్ పంజా

Stock market news: స్టాక్​ మార్కెట్​పై బేర్​ పంజా విసిరింది. సెన్సెక్స్ 1545 పాయింట్లు కోల్పోయి 57,491కి పడిపోయింది. నిఫ్టీ 468 పాయింట్లు నష్టపోయి 17,149కి దిగొచ్చింది. ఒక్కరోజులోనే సెన్సెక్స్​, నిఫ్టీ దాదాపు 3శాతం మేర క్షీణించాయి. దీంతో మదపర్ల సంపద రూ.10లక్షల కోట్లు ఆవిరైంది.

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు, రష్యా-ఇక్రెయిన్​ యుద్ధవాతావరణం వంటి కారణాలు మార్కెట్లను కోలుకోలేని దెబ్బతిశాయి. మదుపర్లకు అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. సిప్లా ఓఎన్​జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి.

ఇంట్రాడే..

సోమవారం ఉదయం 59,039 పాయింట్ల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. మార్కెట్ ఆరంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగగా సెన్సెక్స్ పతనం మొదలైంది. పేటీఎం, జొమాటో, నైకా షేర్లు 52 వారాల కనిష్ఠానికి పతనమయ్యాయి. ఐపీఓకు ఇటీవల యాడ్ అయిన కంపెనీలు 40 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్​ 1700 పాయింట్లకుపైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా కుప్పకులాయి. చివర్లో కాస్త కోలుకోవడం వల్ల నష్టాలు స్వల్పంగా తగ్గాయి.

లాభనష్టాల్లోనివి..

జేఎస్​డబ్ల్యూ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్​, హిందాల్కో షేర్లు 5శాతానికిపైగా నష్టపోయాయి.

ఓఎన్​​జీసీ 1.25శాతం, నిఫ్టీ 2.84శాతం వృద్ధి చెందాయి.

స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు కారణాలు..

  1. గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా ఇటీవలి గరిష్ఠాల నుంచి 16 శాతం కుంగడం గమనార్హం. ఈ ప్రభావం సూచీలపై గట్టిగా పడింది. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
  2. నాస్​డాక్​లో టెక్ స్టాక్‌లు భారీ నష్టాలను చవిచూడడం కూడా మదుపరులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావం ఐటీ రంగంపై పడింది.
  3. మంగళవారం అమెరికాలో ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్‌.. దాన్ని ఎంత వేగంగా.. ఎన్ని దశల్లో అమలు చేయనుందో ఈ భేటీ స్పష్టం చేయనుంది. ఇదే జరిగితే మార్కెటింగ్​ వ్యవస్థపై గట్టి ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
  4. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలోనూ ఫెడ్​ వడ్డీరేట్ల పెంపు వాయిదా లేకపోవడం కూడా మదుపర్లను కలవపరుస్తోంది.
  5. అమెరికాలో నిరుద్యోగం పెరగడం కూడా సూచీలు నష్టాలకు కారణం అయ్యింది.
  6. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తగ్గించింది.
  7. విదేశీ సంస్థాగత మదుపర్లు ఏకంగా రూ.12,600 కోట్లకు పైగా అమ్మకాలు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు.
  8. గత ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. లిస్టింగ్‌లో అదరగొట్టిన జొమాటో వంటి షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతుండడం గమనార్హం. ఇక పేటీఎం షేరు ఏకంగా 50 శాతం నష్టంతో కొనసాగుతోంది.
  9. ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ రంగాల షేర్లు మూకుమ్మడిగా డీలా పడటం వల్ల మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.
  10. ముప్పై షేర్ల ఇండెక్స్​ కూడా పూర్తి స్థాయిలో ఎరుపు రంగు పులుముకోవడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9 శాతం!

Last Updated : Jan 24, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.