ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లకు మూడో రోజూ నష్టాలే- 60,000 దిగువకు సెన్సెక్స్

author img

By

Published : Nov 11, 2021, 3:39 PM IST

bse sensex today live
మూడో రోజూ నష్టాలే.. 17,900 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి(stock market live). బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ 433పాయింట్లు నష్టపోయి 59,920 వద్ద స్థిరపడింది(bse sensex today ). ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 144పాయింట్లు కోల్పోయి 17,874 వద్ద ముగిసింది(nse nifty 50 index ).

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి(stock market news). బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్(bse sensex today live ) 433పాయింట్లు క్షీణించి 59,920 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ(nifty today live ) 144పాయింట్లు కోల్పోయి 17,874 వద్ద స్థిరపడింది.

బ్యాంకు, ఎఫ్​ఎమ్​సీజీ, ఆటో, ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా..

అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, అమెరికా వినియోగదారుల ధరల సూచీ 6.2 శాతం పెరగడం సహా ద్రవ్యోల్బణ భయాలతో మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ స్థితిలోనూ కోలుకోలేకపోయాయి.

ఉదయం 60,292 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​.. 60,293 గరిష్ఠాన్ని నమోదు చేసి వెంటనే పతనమైంది. 59,656 కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు కాస్త పుంజుకుని 433పాయింట్లు కోల్పోయి 59,920 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50.. ఉదయం 17,967 వద్ద ప్రారంభమై.. 19,971 గరిష్ఠాన్ని తాకింది. ఆ వెంటనే మరింత నష్టాల్లోకి జారుకుని 17,798 కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 144పాయింట్లు కోల్పోయి 17,874 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు...

  • టైటాన్​, రిలయన్స్​, టాటాస్టీల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టీసీఎస్​ షేర్లు లాభాలు గడించాయి.
  • ఎస్​బీఐ, టెక్​ఎమ్​, ఎయిర్​టెల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.

గతవారం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ సోమవారం లాభాలు ఆర్జించాయి. మళ్లీ వరుసగా మూడు రోజులు పతనం(stock market news) అయ్యాయి.

ఇదీ చూడండి:- అన్నంత పని చేసిన మస్క్​- 9 లక్షల 'టెస్లా' షేర్లు విక్రయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.