ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి.. 17 వేల మార్క్ కోల్పోయిన నిఫ్టీ

author img

By

Published : Nov 30, 2021, 3:39 PM IST

Stock Market closed today: స్టాక్ మార్కెట్​లు మంగళవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17 వేల మార్కు కోల్పోయింది.

market-live-updates
market-live-updates

Stock Market news: మంగళవారం ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఆరంభంలో సాధించిన లాభాలను పూర్తిగా కోల్పోయాయి. ఒక దశలో 400 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయిన సెన్సెక్స్.. చివరకు 196 పాయింట్ల మేర పతనమై 57,065 వద్ద స్థిరపడింది.

NSE Nifty today: అటు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాల బాటలోనే పయనించింది. 71 పాయింట్లు కోల్పోయి.. 16,983 వద్ద ట్రేడింగ్ ముగించింది.

లాభనష్టాల్లోనివివే..

సెన్సెక్స్ షేర్లలో పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్, టీసీఎస్ షేర్లు రాణించాయి. టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్ నష్టపోయాయి.

ఇదీ చదవండి: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.