ETV Bharat / business

బడ్జెట్​ సన్నాహక భేటీలు 14 నుంచి షురూ

author img

By

Published : Dec 13, 2020, 4:02 PM IST

Pre- Budget consultations Starts from Monday
బడ్జెట్ కసరత్తు ప్రారంభించనున్న కేంద్రం

2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సన్నాహక సంప్రదింపులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా పారిశ్రామిక వేత్తలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సంప్రదింపులు జరపనున్నారు.

వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశాలను సోమవారం నుంచి ప్రారంభించనుంది కేంద్రం. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామికవేతలతో సోమవారం భేటీ కానున్నారు. కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనుండగా.. పద్దు రూపకల్పనకు ముందు ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. మోదీ 2.0 ప్రభుత్వంలో వరుసగా రెండో సారి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

ఇదీ చూడండి:సోమవారం నుంచి 24 గంటలూ ఆర్​టీజీఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.