ETV Bharat / business

3% పెరిగిన డీఏ- నోటిఫై చేసిన మోదీ సర్కార్​

author img

By

Published : Oct 26, 2021, 4:11 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏను (DA hike news) పెంచుతూ కేబినెట్​ తీసుకున్న నిర్ణయాన్ని.. మోదీ సర్కార్​ నోటిఫై చేసింది. ఇది 2021 జులై 1 (DA hike 2021) నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

DA hike to 31% effective from July 1: FinMin
3 శాతం పెరిగిన డీఏ- నోటిఫై చేసిన మోదీ సర్కార్​

ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (Govt employees salary) కరవు భత్యాన్ని(DA hike news) 31 శాతానికి పెంచుతూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇది 2021 జులై 1 (DA hike 2021) నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కనీస వేతనంపై (బేసిక్​ పే) ఈ డీఏ పెంపు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సాయుధ దళ సిబ్బంది, రైల్వే ఉద్యోగులకు సంబంధించి.. రక్షణ, రైల్వే మంత్రిత్వ శాఖలు వేర్వేరుగా ప్రకటిస్తాయని తెలిపింది.

గతంలో కరవు భత్యం (Dearness allowance news) 28 శాతంగా ఉండగా.. ఇప్పుడు 31 శాతానికి చేరింది (DA hike july 2021). ఈ నిర్ణయంతో.. 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు (DA hike for pensioners) ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడనుంది.

కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని(DA hike news) నిలిపివేసింది. ఈ ఏడాది జులై నుంచి దాన్ని పునరుద్ధరించడమే గాక.. 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి పెంచింది. ఇప్పుడు మరో 3 శాతం(DA hike 2021) పెరిగింది.

ఇవీ చూడండి: Alibaba News: ఒక్క మాట ఖరీదు.. రూ. 25 లక్షల కోట్లు!

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు 17 రోజుల సెలవు.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.