ETV Bharat / business

ఇక సీఏ అవసరం లేకుండానే జీఎస్​టీ రిటర్నులు!

author img

By

Published : Aug 1, 2021, 1:32 PM IST

Updated : Aug 1, 2021, 4:51 PM IST

self-certify For GST annual returns
స్వీయ మదింపుతోనే జీఎస్​టీ రిటర్న్​

జీఎస్​టీ రిటర్ను దాఖలు విషయంలో కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ) చిన్న కంపెనీలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ.5 కోట్లపైన టర్నోవర్ ఉన్న కంపెనీలు సీఏ ఆడిట్​ చేసిన రిటర్ను స్థానంలో.. స్వీయ మదింపు రిటర్నును దాఖలు చేయొచ్చని తెలిపింది.

రూ.5 కోట్లకన్నా ఎక్కువ టర్నోవర్​ ఉన్న కంపెనీలకు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం (సీబీఐసీ) జీఎస్​టీ వార్షిక రిటర్ను దాఖలు విషయంలో మరో వెసులు బాటు కల్పించింది. ఇకపై చార్టర్డ్ అకౌంటెంట్​ (సీఏ) ఆడిట్​ నివేదిక స్థానంలో.. స్వీయ మదింపు రిటర్ను దాఖలు చేయొచ్చని వెల్లడించింది.

2020-21కి సంబంధించి.. వార్షిక నివేదిక రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు.. జీఎస్​టీఆర్​-9/9ఏ ద్వారా వార్షిక రిటర్ను దాఖలు చేయడం తప్పనిసరి. రూ.5 కోట్ల టర్నోవర్​ ఉన్న సంస్థలు జీఎస్​టీఆర్​-9సీ ద్వారా అదనంగా.. సర్దుబాటు స్టేట్​మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు స్టేట్​మెంట్​కు.. చార్టర్డ్​ అకౌంటెంట్​ గుర్తింపు తప్పనిసరిగా ఉండేది. అయితే సీబీఐసీ తాజా నోటిఫికేషన్​తో దీని స్థానంలో కంపెనీలు స్వయంగా మదింపు చేసిన రిటర్నును దాఖలు చేసుకునేందుకు వీల కలగనుంది.

ఇదీ చదవండి: పెరిగిన జీఎస్​టీ వసూళ్లు- జులైలో రూ.లక్ష కోట్లపైకి

Last Updated :Aug 1, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.