ETV Bharat / business

ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ

author img

By

Published : Feb 29, 2020, 3:18 PM IST

Updated : Mar 2, 2020, 11:15 PM IST

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు ముకేశ్ అంబానీ. 'హురూన్ గ్లోబల్​ రిచ్ లిస్ట్​-2020' విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో ముకేశ్​ 9వ స్థానంలో నిలిచారు. టాప్​ 10లో స్థానం దక్కించికున్న ఏకైక ఆసియన్​గా నిలిచారు రిలయన్స్​ అధినేత.

mukesh ambani
ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే తొమ్మిదో అత్యంత ధనవంతుడిగా ఘనత సాధించారు. 'హురూన్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్​ 2020' విడుదలు చేసిన జాబితాలో 67 బిలియన్ డాలర్లు (రూ.4.83 లక్షల కోట్లకు పైమాటే)తో ఆసియా అపరకుబేరుడిగా అవతరించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్​ 10లో స్థానం దక్కించికున్న ఏకైక ఆసియన్​గా ముకేశ్ అంబానీ నిలిచారు.

అంబానీకి చెందిన టెలికాం వ్యాపారాలు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుండటమే ఇందుకు కారణమని హురూన్​ రిచ్​ లిస్ట్​ పేర్కొంది.

మరిన్ని విశేషాలు..

ప్రపంచ కుబేరుల జాబితా టాప్​ 10లో ముకేశ్​ అంబానీ చోటు దక్కించుకోవడం ఇది రెండో సారి.

రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువను తాకిన తొలి భారతీయ కంపెనీగానూ రిలయన్స్​కు పేరుంది.

ధనికుల దేశాల్లో భారత్​ స్థానం..

అత్యధిక ధనవంతులు ఉన్న దేశాల జాబితాలో భారత్​ మూడో స్థానానికి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ ఏకంగా​ 33 స్థానాలు మెరుగైంది. హరూన్​ రిచ్​ లిస్ట్​ ప్రకారం 169 మంది భారతీయులు బిలియనీర్లుగా ఉన్నారు. వారిలో 137 మంది భారత్​లో ఉండగా.. 32 మంది దేశానికి వెలుపల ఉంటున్నారు.

వాణిజ్య రాజధాని ముంబయి 50 మందితో దేశంలోనే అత్యధిక ధనికులున్న నగరంగా ఘనత సాధించింది. ఆ తర్వాత దిల్లీ (30 మంది) రెండో స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:ఏజీఆర్ బకాయిలు: రూ.8 వేల కోట్లు చెల్లించిన ఎయిర్​టెల్​

Last Updated : Mar 2, 2020, 11:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.