ETV Bharat / business

'వర్క్ ఫ్రం హోమ్' చేసే వారికి జియో గుడ్​ న్యూస్​!

author img

By

Published : May 9, 2020, 9:52 AM IST

jio new plans
జియో కొత్త ప్లాన్​లు

'వర్క్ ఫ్రం హోమ్' చేసే వారికి మరో బంపర్ ఆఫర్​ ప్రకటించింది రిలయన్స్ జియో. రోజుకు 2 జీబీ డేటా (అపరిమిత కాల్స్​, ఎస్​ఎంఎస్​లు కూడా) చొప్పున ఏడాది పాటు వచ్చే విధంగా వార్షిక ప్లాన్​లో మార్పులు చేసింది. అదనపు డేటా కోసం కొత్తగా మూడు టాప్ ఆప్​ ప్లాన్​లు ఆవిష్కరించింది. కొత్త ప్లాన్​లను పూర్తి వివరాలు మీ కోసం.

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో టారిఫ్​లలో మార్పులు చేసింది. వినియోగదారులకు తక్కువ ధరకే ఎక్కువ డేటా, ఎక్కువ రోజులు వ్యాలిడిటీ లభించేలా కొత్త ప్లాన్​లను ఆవిష్కరించింది. ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే వార్షిక ప్లాన్​ను 33 శాతం చౌకగా చేసింది.

ప్రస్తుతం రూ.2,121 ప్లాన్​తో 336 రోజుల పాటు అపరిమిత కాల్స్​, ఎస్​ఎంఎస్​లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తోంది. ఈ ప్లాన్​ను తాజాగా రూ.2,399తో.. 365 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్​ఎంఎస్​లు అందించేలా మార్చింది.

'వర్క్ ఫ్రం హోమ్' ప్లాన్​లో.. రూ.151 (30 జీబీ), రూ.201 (40 జీబీ), రూ.251 (50 జీబీ) టాప్​ ఆప్​ ప్లాన్​లను విడుదల చేసింది. రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత అదనపు యూసేజీకి ఈ ప్లాన్​లు ఉపయోగపడతాయి.

ఇదీ చూడండి:'గూగుల్' ఉద్యోగులకు ఏడాదంతా వర్క్​ఫ్రమ్​ హోమ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.