ETV Bharat / business

మాల్యా కథ మళ్లీ మొదటికి.. మెలిక పెట్టిన బ్రిటన్​!

author img

By

Published : Jun 4, 2020, 4:05 PM IST

రుణ ఎగవేతదారు విజయ్​ మాల్యా కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇవాళో రేపో మాల్యాను.. బ్రిటన్​ ప్రభుత్వం భారత్​కు అప్పగిస్తుందని వార్తలు వెలువడినా... అది ఇప్పట్లో జరిగేలా లేదు. బ్రిటన్​ చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించిన తర్వాతే.. భారత్​కు పంపిస్తామని బ్రిటన్​ హై కమిషన్​ స్పష్టం చేసింది.

Vijay Mallya's extradition can't take place until legal issues resolved
మాల్యా కథ మళ్లీ మొదటికి.. మెలిక పెట్టిన బ్రిటన్​!

పలాయనంలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని వార్తలు వచ్చినా.. అది ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. బ్రిటన్​ ప్రభుత్వం తాజాగా మరో మెలిక పెట్టింది. చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించాకే.. పంపిస్తామని బ్రిటన్ హై కమిషన్ స్పష్టం చేసింది.

అయితే, ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. అది రహస్యమని చెబుతున్న బ్రిటన్ హై కమిషన్.. యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాల్యాను ఇప్పట్లో భారత్‌కు రప్పించడం సాధ్యమేనా... అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

బ్రిటన్​ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలగడంతో మాల్యాను భారత్‌కు తీసుకొచ్చి.. సీబీఐ, ఈడీ కస్టడీలోకి తీసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ.. యూకే చట్టాల్లోని నిబంధనలు మాల్యాకు వరంగా మారాయి.

మే 14నే ఎదురుదెబ్బ...

మే 14నే కోర్టులో చుక్కెదురు..మే 14న బ్రిటన్ హైకోర్టులో.. తనని భారత్​కు అప్పగించకూడదన్న మాల్యా అప్పీలు వీగిపోయిన సమయంలోనే మాల్యాను భారత్​కు తెచ్చే అంశమై మార్గం సుగమమైంది.

17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగవేశారు మాల్యా. ఈ మొత్తంతో 40 విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.