ETV Bharat / business

వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 345 మైనస్​

author img

By

Published : Jul 8, 2020, 3:45 PM IST

Updated : Jul 8, 2020, 5:14 PM IST

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇండెక్స్ హెవీవెయిట్స్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్​లు నష్టపోయాయి.

stocks close red
నష్టాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

స్టాక్​మార్కెట్ల వరుస ఐదురోజుల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ప్రతికూల సూచనల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. ఇండెక్స్ హెవీవెయిట్స్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టాలు నమోదుచేశాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 345 పాయింట్లు కోల్పోయి 36 వేల 329 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 10 వేల 705 వద్ద స్థిరపడింది.

ట్రేడర్స్ ప్రకారం, కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్​మార్కెట్లపైనా పడింది.​

లాభనష్టాల్లో

ఇండస్​ఇండ్ బ్యాంకు, ఎస్​బీఐ, టాటాస్టీల్, ఐటీసీ, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు రాణించాయి.

బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్​ ఫిన్​సెర్వ్​, హెచ్​సీఎల్ టెక్, మారుతి సుజుకీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటాన్ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు రాణించగా... టోక్యో, సియోల్ సూచీలు నష్టపోయాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి

రూపాయి విలువ 9 పైసలు తగ్గి, డాలరుకు రూ.75.02గా ఉంది.

చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.16 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 43.01 డాలర్లుగా ఉంది.

వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 345 మైనస్​

ఇదీ చూడండి: కరోనా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలివి...

Last Updated : Jul 8, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.