ETV Bharat / business

ఒడుదొడుకుల మధ్య ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

author img

By

Published : Dec 2, 2020, 3:46 PM IST

Updated : Dec 2, 2020, 5:55 PM IST

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు బుధవారం దాదాపు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు తగ్గి..44,650 దిగువకు చేరింది. నిఫ్టీ 5 పాయింట్ల అతిస్వల్ప లాభంతో స్థిరపడింది. బుధవారం సెషన్​లో బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

stock markets today
నేటి స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 44,618 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ అతి స్వల్పంగా 5 పాయింట్లు పెరిగి 13,114 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

ఇటీవలి భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల మిడ్​ సెషన్​లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే చివరి గంటలో ఐటీ షేర్లు అనూహ్యంగా లాభాల్లోకి రావడం వల్ల సూచీలు మిశ్రమంగా సెషన్​ ముగించాయి. లోహ, వాహన రంగ షేర్ల సానుకూలతలూ ఇందుకు తోడయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 44,729 పాయింట్ల అత్యధిక స్థాయి, 44,169 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,128 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 12,983 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్, టైటాన్​, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎం&ఎం షేర్లు లాభాలను నమోదు చేశాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన టోక్యో, సియోల్ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

మార్కెట్లో నేడు

ఇదీ చూడండి:'రూ.68 లక్షల కోట్లకు రాష్ట్రాల అప్పులు'

Last Updated : Dec 2, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.