ETV Bharat / business

రతన్​ టాటాకు 'గ్లోబల్​ విజనరీ' అవార్డ్​

author img

By

Published : Dec 18, 2020, 10:13 PM IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్​ టాటా 'గ్లోబల్​ విజనరీ ఆఫ్​ సస్టైనబుల్​ బిజినెస్​ అండ్​​ పీస్' అవార్డ్ అందుకోనున్నారు. శాంతి, సుస్థిరాభివృద్ధిని నెలకొల్పే ఆవిష్కరణలను ప్రోత్సహించినందుకుగాను ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది ఇండో-ఇజ్రాయిల్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​.

Ratan Tata
రతన్​ టాటాకు 'గ్లోబల్​ విజనరీ' అవార్డ్​

టాటా గ్రూప్​ మాజీ ఛైర్మన్​, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ ​టాటా మరో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోనున్నారు. పాలస్తీనాతో పాటు గల్ఫ్ ప్రాంతంలో శాంతి, సుస్థిరాభివృద్ధిని నెలకొల్పే ఆవిష్కరణలను ప్రోత్సహించినందుకుగాను 'గ్లోబల్​ విజనరీ ఆఫ్​ సస్టైనబుల్​ బిజినెస్​ ఆండ్​​ పీస్' అవార్డ్​కు ఎంపిక చేసింది.. ఇండో-ఇజ్రయిల్​ ఛాంబర్ అఫ్​ కామర్స్. డిసెంబర్​ 21న దుబాయ్​లో జరగనున్న ఇండో-ఇజ్రాయిల్​ అంతర్జాతీయ సమాఖ్య ప్రారంభోత్సవంలో పరస్కారం ప్రదానం చేయనున్నారు.

"ఇండియా, ఇజ్రాయిల్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి రతన్​ టాటా ఎంతో కృషి చేశారు. పాలస్తీనాతో సహా గల్ఫ్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు పాటుపడే ఆవిష్కరణలకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్​ను కొన్ని సార్లు సందర్శించారు టాటా. అది ఇరుదేశాల బంధాలు బలపడేందుకు సాయపడింది. ఈ పురస్కారానికి రతన్​ టాటా తగిన వ్యక్తి. "

- రాజీవ్​ బైరాన్​,ఇండో-ఇజ్రయిల్​ ఛాంబర్ అఫ్​ కామర్స్ అధ్యక్షుడు

ఇతర దేశాల్లోనూ పరస్పరం వ్యాపార అవకాశాల లబ్ధి లక్ష్యంతో ఇండో-ఇజ్రాయిల్​ అంతర్జాతీయ సమాఖ్యను మెుదటిసారిగా దుబాయ్​లో ఏర్పాటు చేస్తున్నారు. దేశాల మధ్య త్రైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందడానికి ఇది మార్గదర్శకం అవుతుందని రాజీవ్​ తెలిపారు.

టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం (టీఏయూ) టెక్నాలజీ ఇన్నోవేషన్ మొమెంటం ఫండ్‌లో టాటా గ్రూప్ మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఆటోమెుటివ్​, వైద్యరంగం వంటి తదితర రంగాల అంకుర సంస్థలకు నిలయమైన ఆ ప్రాంతాల్లో లైసెన్స్ కోసం చర్చించే అధికారం ప్రధాన పెట్టుబడిదారుగా టాటా గ్రూప్​కే ఉంది.

ఇదీ చూడండి: బహిరంగంగా కరోనా టీకా తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.