ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Dec 21, 2020, 5:05 PM IST

Prices of precious metals rise, silver futures surge 3%
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 496 పెరగ్గా.. కిలో వెండి ధర ఏకంగా రూ.2,249 ఎగబాకింది.

దేశీయంగా బంగారం, వెండి ధరల్లో సోమవారం భారీగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.496 పెరిగి.. రూ.50,297కు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు రూ.2,249 ఎగబాకి.. రూ.69,477 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,898 డాలర్ల వద్ద ఉండగా.. ఔన్సు వెండి 26.63 డాలర్లుకు చేరింది.

ఇదీ చూడండి: బంగారం దిగుమతులు 40 శాతం తగ్గాయ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.