ETV Bharat / business

జనవరి నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం

author img

By

Published : Dec 3, 2019, 2:38 PM IST

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా.. 2020 జనవరి నుంచి తమ కంపెనీ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

Maruti Suzuki to increase prices from January to offset rising input costs
జనవరి నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం!

2020 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతామని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గతేడాది ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహనాల వ్యయం భారీగా పెరిగిపోయిందని... ఇది కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపిందని మారుతీ సుజుకి ఇండియా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

"2020 జనవరి నుంచి వివిధ మోడళ్ల ధరల్లో పెరుగుదల ఉంటుంది. కార్ల ఉత్పత్తికి అవుతున్న అదనపు వ్యయాన్ని కొంత వినియోగదారులకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది."- మారుతీ సుజుకి ఇండియా

2020 జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు... మోడళ్లను బట్టి వేర్వేరుగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ స్మాల్​ కారు ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్​ వెహికల్ ఎక్స్​ఎల్​ 6 వరకు.. రూ.2.89 లక్షల నుంచి రూ.11.47 లక్షల వరకు (దిల్లీ ఎక్స్​ షోరూమ్​) సంస్థ విక్రయిస్తోంది.

ఇదీ చూడండి: 'వారిది మోసపూరిత రాజకీయం.. మాది ప్రజాసేవ'

Madurai (TN), Dec 03 (ANI): Due to rains, price of jasmine in Madurai has gone up in Madurai. Jasmine flower is cultivated in parts of Tamil Nadu. Price of kilo of jasmine is fetching Rs 3000-3500 in the market. Madurai jasmine flowers are exported to many countries, especially Singapore, Malaysia and Dubai.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.