ఉత్పాదక ఆధారిత బోనస్ పరిధిలోకి రాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Bonus for Central government employees) 30 రోజుల అనుత్పాదక ఆధారిత బోనస్ను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గ్రూప్-బి కిందికి వచ్చే నాన్గెజిటెడ్ ఉద్యోగులందరితోపాటు, గ్రూప్-సి ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. (Bonus for Central government employees)
కేంద్ర పారామిలిటరీ దళాలు, సాయుధ దళాల్లోని అర్హులైన ఉద్యోగులకూ ఈ బోనస్ వర్తిస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది.రూ.7వేల నెలవారీ జీతం ఆధారంగా ఈ బోనస్ను లెక్కించి ఇస్తారు.
2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉండి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వరుసగా కనీసం ఆరునెలల సర్వీసు ఉన్నవారు మాత్రమే ఈ బోనస్ పొందడానికి అర్హులని వెల్లడించింది. ఆర్థికశాఖ లెక్కల ప్రకారం అర్హులైన ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.6,907 బోనస్ రానుంది.
వారికి కూడా...
ఈ ఏడాది మార్చి 31కు ముందు ఆరోగ్య కారణాల వల్ల రిటైర్ అయిన, మరణించిన ఉద్యోగులకు బోనస్ ఇస్తామని కేంద్రం తెలిపింది. అయితే ఈ ఉద్యోగులు ఆ ఏడాదిలో ఆరు నెలలు రెగ్యులర్ సర్వీస్లో ఉండాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'ఆర్ వ్యాల్యూ' ఒకటి లోపే- కరోనా కంట్రోల్ అయినట్టేనా?