ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Oct 23, 2021, 10:32 AM IST

gold rate today
బంగారం ధర

బంగారం ధర (Gold Rate Today) శనివారం స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు (Silver price today) స్వల్పంగా పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.330 పెరిగి (Gold Price in Hyderabad) రూ.49,430 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.340 అధికమై రూ.66,995 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,430గా ఉంది. కిలో వెండి ధర రూ.66,995 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,430గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,995 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,792 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధన ధరల పెంపు..

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్​కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ రూ.111.51కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 35 పైసలు అధికమై.. లీటర్​ రూ.104.66 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 35 పైసలు పెరిగి.. లీటర్​ రూ.113.54కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.09 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.27 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.86కి చేరింది.

ఇదీ చూడండి : క్యూ2 ఫలితాల్లో రిలయన్స్ జోరు- రూ.13,680కోట్ల నికర లాభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.