ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. గెలాక్సీ ఎం సిరీస్లో భాగంగా.. 'మ్యాక్స్ అప్ గెలాక్సీ ఎం02' పేరుతో ఈ ఫోన్ను విడుదల చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రూ.10,000 లోపు శాంసంగ్ తీసుకువచ్చిన మొదటి ఫోన్ ఇదే.
'మ్యాక్స్ అప్ గెలాక్సీ ఎం02' ఫీచర్లు..
- 6.5 అంగుళాల, హెచ్డీ ప్లస్ తెర
- 1టీబీ వరకు మెమొరీ సామర్థ్యం
- క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్
- 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- 13 ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ రిఫైన్డ్ మ్యాక్రో లెన్స్. (ట్రిపుల్ రేర్ కెమెరా)
- 5ఎంపీ సెల్ఫీ కెమెరా
- ధర రూ.8,999(3జీబీ+32జీబీ) రూ.9,999(4జీబీ+64జీబీ)
- రంగులు- నలుపు, నీలం, ఎరుపు
'డిజిటల్ ఇండియా' ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఫోన్ను విడుదల చేసినట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది.
ఇదీ చూడండి:ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్: ఎవరు గెలిచారు?