ETV Bharat / business

ఆధార్​ అప్​డేట్​ కోసం 20వేల సీఎస్​సీలకు అనుమతి

author img

By

Published : Apr 27, 2020, 8:27 PM IST

దేశంలోని 20వేల కామన్​ సర్వీస్​ సెంటర్లలకు ఆధార్​ అప్​డేట్​ బాధ్యతలు అప్పగించింది ఉడాయ్​. ఇందుకోసం కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. ఈ సౌలభ్యంతో జనాభా, సంతానం, చిరునామాలో మార్పులను అప్​డేట్​ చేసుకోవచ్చు.

Around 20,000 CSCs get permission to update Aadhaar details
ఆధార్​ అప్​డేట్​ కోసం 20వేల సీఎస్​సీలకు అనుమతి

ఆధార్​ వివరాలను అప్​డేట్​ చేసేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 20వేల కామన్​ సర్వీస్​ సెంటర్ల(సీఎస్​సీ)లకు అనుమతులిచ్చింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-ఉడాయ్. ఈ సీఎస్​సీలు బ్యాంకింగ్​ కరెస్పాండెంట్లుగా పని చేస్తాయని స్పష్టం చేసింది.

అయితే ఇవి షరుతులతో కూడిన అనుమతులేనని స్పష్టం చేస్తూ ఈ నెల 24న.. సీఎస్​సీ ఈ-గవర్నెన్స్​ సర్వీసెస్​ సీఈఓ దినేశ్​ త్యాగికి లేఖ రాసింది ఉడాయ్​. కేవలం జనాభాకు సంబంధించిన వివరాలకే అనుమతులున్నాయని స్పష్టం చేసింది. వేలిముద్రలు, ఐరిస్​ అనే సాఫ్ట్​వేర్​ సహాయంతో ఆపరేటర్లు, నివాసితుల ప్రమాణీకరణ జరుగుతుందని తెలిపింది.

ఈ ఏడాది జూన్​కల్లా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. సంతానం, చిరునామాలోని మార్పులకు సంబంధించిన బయోమెట్రిక్​ వివరాలను సీఎస్​సీలు అప్​డేట్​ చేస్తాయి.

గ్రామీణ ప్రజలకు ఈ సదుపాయం అధికంగా ఉపయోగపడుతుందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ అభిప్రాయపడ్డారు. ఉడాయ్​ నిబంధనలకు అనుగుణంగా, బాధ్యతాయుతంగా ఈ పని చేపట్టాలని సీఎస్​సీ సభ్యులకు సూచించారు.

ఆధార్​లో మార్పులు చేయడానికి జిల్లాస్థాయిలోని సీఎస్​సీ ఈ-గవర్నెన్స్​ సర్వీసులకు ఇప్పటికే అనుమతిలిచ్చింది ఉడాయ్​.

ఇదీ చూడండి:- 6.5లక్షల మందికిపైగా పీఎఫ్‌ ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.