ఇక ఇంటి వద్దే కొత్త సిమ్​ కార్డ్​.. ఆధార్​ ఉంటే చాలు!

author img

By

Published : Sep 22, 2021, 1:31 PM IST

Aadhaar KYC for new mobile number

కొత్త కనెక్షన్​ తీసుకోవాలనుకుంటున్న లక్షలాది మంది మొబైల్​ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ఆధార్​, డిజిలాకర్​ సాయంతో ఇంటికే సిమ్​ కార్డు పొందే (aadhaar e-kyc for new mobile connections )సౌలభ్యాన్ని డాట్​ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ఆన్​లైన్​లోనే పోస్ట్​ పెయిడ్​, ప్రీ-పెయిడ్ ప్లాన్లు మార్చుకునే వెసులుబాటు లభించింది.

మొబైల్​ సిమ్​ కార్డు కొనుగోలు(new mobile connection) చేయాలంటే.. సమీప స్టోర్​కు వెళ్లి ఆధార్​, ఇతర సమాచారాన్ని అందించిన తర్వాతే మన చేతికి వస్తుంది. అయితే.. ఇకపై వినియోగదారులు ఆన్​లైన్​లో కొత్త మొబైల్​ కనెక్షన్​కు(aadhaar e-kyc for new mobile connections ) దరఖాస్తు చేసుకుని, ఇంటికే సిమ్​ కార్డు పొందే సౌలభ్యాన్ని కల్పిస్తూ టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్​) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఆధార్​ లేదా డిజిలాకర్​లో భద్రపరిచిన పత్రాల ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన టెలికాం సంస్కరణల్లో భాగంగా డాట్​ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త నిబంధనల ప్రకారం..

మొబైల్​ కనెక్షన్​ పొందేందుకు అవసరమైన ఆధార్​ ఆధారిత ఇ-కేవైసీ(Aadhaar based e-KYC ) ధ్రువీకరణ ప్రక్రియకు వినియోగదారులు రూ.1 చెల్లించాలి. ఆధార్​ ఇ-కేవైసీ ప్రక్రియను మళ్లీ తెచ్చేందుకు 2019 జులైలో బారత టెలికాం చట్టం 1885ను ప్రభుత్వం సవరించింది.

మరోవైపు.. కస్టమర్లు పోస్ట్​ పెయిడ్​ నుంచి ప్రీ-పెయిడ్​కు మారాలన్నా, ప్రీ-పెయిడ్​ నుంచి పోస్ట్​ పెయిడ్​కు మారాలన్నా ఆన్​లైన్​ నుంచే మార్చుకోవచ్చు. ఓటీపీ జనరేటెడ్​ ఆధారిత ప్లాన్​ మార్పు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది డాట్​.

ఇదీ చూడండి: ఓటీపీతో పోస్ట్​పెయిడ్​ నుంచి ప్రీపెయిడ్​కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.