ETV Bharat / briefs

ఆంధ్రప్రదేశ్​లో రేపే ఇంటర్ పరీక్షల ఫలితాలు

author img

By

Published : Jun 11, 2020, 5:48 PM IST

ఏపీలో రేపే ఇంటర్ పరీక్షల ఫలితాలు...
ఏపీలో రేపే ఇంటర్ పరీక్షల ఫలితాలు...

ఏపీలో ఇంటర్​ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు వెల్లడించనున్నారు. కరోనా లాక్​డౌన్ కారణంగా సమాధాన పత్రాల మూల్యాంకనం ఆలస్యమైనా.. ఇటీవల అమలైన ఆంక్షల సడలింపులతో ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేయనున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ రేపు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

కరోనా విజృంభణ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమైంది. అయితే.. ఇటీవల ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో మూల్యాంకనాన్ని పూర్తి చేసిన ఇంటర్‌ బోర్డు అధికారులు ఫలితాలను ఎట్టకేలకు రేపు ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.

ఇదీ చూడండి:

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్​కు కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.